యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 8: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి బుధవారం నిత్యోత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి ఉదయం, సాయంత్రం సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్ర నామార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం అత్యంత వైభవంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం వెండి మొక్కుజోడు సేవలు, దర్బార్ సేవ ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారని అధికారులు తెలిపారు.