తెలంగాణ స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్పై నీతి ఆయోగ్ ప్రశంసలు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్పై నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష సాంకేతికత రంగంలో ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా తెలంగాణ ముందుకు సాగేందుకు దోహదపడుతున్నదని పేర్కొంది.
లాంచ్ వెహికిల్స్, శాటిలైట్ సిస్టం, గ్రౌండ్ ఎక్విప్మెంట్ వంటి వాటి తయారీలో దేశీయ ఉత్పత్తులకు కమర్షియల్ హబ్గా తెలంగాణ ఆవిర్భవిస్తున్నదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మంగళవారం ట్వీట్ చేశారు. వర్చువల్ రియాలిటీ వేదిక మెటావర్స్ ద్వారా దేశంలో నిర్వహించిన అధికార కార్యక్రమం స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్ విడుదల కార్యక్రమమేనని కొనియాడారు. సోమవారం స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్ విడుదల కార్యక్రమంలో అమితాబ్కాంత్ పాల్గొన్నారు. దేశ అంతరిక్ష సాంకేతికత అభివృద్ధికి అవకాశాలు, తెలంగాణకు ఉన్న అనుకూలతలను ప్రస్తావించారు. ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తెలంగాణ అద్భుత విజయాలు సాధిస్తున్నదని కొనియాడారు.