హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ సంస్థ ఈ నెల 27 నుంచి అన్ని రాష్ర్టాల సీఎస్లతో సమావేశం నిర్వహించనున్నది. 3 రోజులపాటు జరిగే సమావేశాలకు ఢిల్లీలోని పూసా ఇన్స్టిట్యూట్ వేదిక కానున్నది. రాష్ర్టాల సీఎస్లు హాజరు కావాలని నీతి ఆయోగ్ సీఈవో లేఖలు రాశారు.