వరంగల్ : వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( NIT-Warangal ) కాలేజీ.. 2018, 2019 సంవత్సరాలకు గానూ ఫ్యాకల్టీ అవార్డులను ప్రకటించింది. ఆరుగురు ప్రొఫెసర్లకు బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డులను ప్రకటించింది నిట్. యంగ్ రీసెర్చ్ కేటగిరిలో మరో ముగ్గురు లెక్చరర్లకు అవార్డులు వరించాయి. వీరందరికి నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణ రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంజినీరింగ్ విభాగంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి 2018 సంవత్సరానికి గానూ ప్రొఫెసర్ డీవీఎల్ఎన్ సోమయాజులు, 2019 ఏడాదికి గానూ మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి ప్రొఫెసర్ ఏ కుమార్ ఎంపికయ్యారు. సైన్స్ విభాగంలో 2018 ఏడాదికి గానూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య(ARC)కు అవార్డు వరించింది. ఈ కేటగిరిలో 2019 సంవత్సరానికి ఎవరు దరఖాస్తు చేసుకోలేదు.
ఇంజినీరింగ్ విభాగంలో బెస్ట్ రీసెర్చ్ అవార్డు కింద కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ వై పైడిశెట్టి(2018), మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి ప్రొఫెసర్ ఏ కుమార్(2019) ఎంపికయ్యారు. సైన్స్ విభాగంలో బెస్ట్ రీసెర్చ్ అవార్డు కింద కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ కే లక్ష్మారెడ్డి(2018), అదే డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ ఎన్ వెంకటాద్రి(2019)కి అవార్డు వచ్చింది.
2018 సంవత్సరానికి గానూ యంగ్ రీసెర్చ్ అవార్డును మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ కే కిరణ్ కుమార్కు, 2019 ఏడాదికి గానూ కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ ఏ శేషగిరి రావుకు అవార్డు వరించింది. సైన్స్ విభాగంలో మ్యాథమేటిక్స్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ సీహెచ్ రామ్ రెడ్డికి(2019) అవార్డు వచ్చింది.