ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 8: ప్రేమ పేరిట ఓ యువకుడు యువతిని ఐదేండ్లుగా వేధిస్తు న్నాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఉద్దేశంతో.. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ గురువారం చోటుచేసుకున్నది. ఖానాపూర్లోని అంబేద్కర్నగర్ కాలనీకి చెందిన జూకింది శ్రీకాంత్.. షేట్పెల్లి అలేఖ్య(22) స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. శ్రీకాంత్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ కాగా క్వాలిఫై కాలేదు. అలేఖ్య టైలరింగ్ కోచింగ్ తీసుకుంటున్నది.
శ్రీకాంత్ ఐదేండ్లుగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. యువతి విషయాన్ని పెద్దలకు చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో అతడిని మందలించారు. అలేఖ్యకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. విషయం తెలుసుకున్న శ్రీకాంత్.. వరుడికి సమాచారం ఇచ్చి ఆ పెండ్లిని చెడగొట్టాడు. తనకు దక్కని అలేఖ్య మరెవరికీ దక్కకూడదని, అందుకు యువతిని కడతేర్చాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య అలేఖ్య, ఆమె వదిన జయశీల, జయశీల కుమారుడు రియాన్స్ కలిసి ఖానాపూర్లోని టైలరింగ్కు వెళ్లి నడుచుకుంటూ వస్తుండటాన్ని గమనించాడు. ఇదే అదునుగా భావిం చి శివాజీనగర్ రోడ్డు వద్ద అలేఖ్యపై కత్తితో దాడి చేశాడు. ఛాతీ, వెన్ను, పొట్ట భాగంలో నరకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అడ్డుకోబోయిన ఆమె వదిన జయశీల చేతికి తీవ్ర గాయాలయ్యాయి. జయశీల కుమారుడు రియాన్ష్ తలకూ గాయమైంది. విషయం తెలుసుకున్న నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, సీఐ మోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు.