నిర్మల్ : జిల్లాలో బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు మొదలయ్యాయి. ఈ నెల 17న నిర్మల్ జిల్లాలో అమిత్ షా పర్యటనకు సంబంధించి ఓ పారిశ్రామికవేత్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. కేంద్ర మంత్రి రానున్న నేపథ్యంలో స్వాగత ఫ్లెక్సీలను జిల్లా కేంద్రంలో పలుచోట్ల ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆదిలాబాద్ ఎంపీ సో బాపు రావు చిత్రాలు ఉన్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఫొటోలు లేకపోవడంతో స్థానిక కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు.జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వేత్త కంది శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ప్రొటోకాల్ పాటించకుండా రాష్ట్ర, జిల్లా అధ్యక్ష ఫొటోలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
కేంద్ర మంత్రి పర్యటన మొదలు కాకముందే జిల్లా బీజేపీలో ఆధిపత్యపోరు నెలకొనడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి