హైదరాబాద్: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat zareen) నేడు హదరాబాద్ రానున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నది. దీంతో తెలంగాణ ఆణిముత్యానికి ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందూరు బిడ్డకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎయిర్పోర్టులో స్వాగతం పలుకనున్నారు.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో నిఖత్ జరిన్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్లో 52 కేజీల విభాగంలో థాయ్లాండ్కు చెందిన జుటామస్ జిటిపాంగ్ను 0-5తో చిత్తు చేసి బంగారు పతకం అందుకున్నది. దీంతో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ, లేఖ తర్వాత ప్రపంచ టైటిల్ను గెలుచుకున్న ఐదో భారతీయ మహిళా బాక్సర్గా జరీన్ నిలిచింది.