హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. శీతల గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు బయట తిరగడానికి భయపడిపోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు (temperature) రికార్డు స్థాయికి పడిపోయాయి. జిల్లాలోని భీమ్పూర్ మండలంలో ఉన్న అర్లి (టీ)లో (Arli) అత్యల్పంగా 4.9 డిగ్రీలు నమోదయింది. కుమ్రం భీమ్ జిల్లాలోని సిర్పూర్ (యూ)లో 5.8గా, గిన్నెదరిలో 6.0, రంగారెడ్డి జిల్లాలోని మీర్ఖాన్పేట, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 6.2 డిగ్రీల చొప్పున నమోదయింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పల్దరి, జైనాద్లో 6.3, ఆదిలాబాద్ అర్బన్, నిర్మల్ జిల్లాలోని పెంబీలో 6.6 డిగ్రీ చొప్పున నమోదయింది.
ఇక హైదరాబాద్లో అతితక్కువగా వెస్ట్ మారేడ్పల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మొత్తంగా 23 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది.