హైదరాబాద్: రాష్ట్రంలో చలితో గజగజ వణికిపోతున్నారు. శీతల గాలులతో చలితీవ్రత పెరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో వరుగా 10 డిగ్రీల కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని భీమ్పూర్ మండలంలో ఉన్న అర్లి (టీ)లో అత్యల్పంగా 7.6 డిగ్రీలు రికార్డవగా, ఆదిలాబాద్ రూరల్ జిల్లాలోని పిప్పల్దరిలో 8 డిగ్రీలు, కుమ్రం భీమ్ జిల్లా సిర్పూర్ (యూ)లో 8.1 డిగ్రీ చొప్పున నమోదయింది.
ఇక ఆదిలాబాద్ జిల్లాలోని భరంపూర్లో 8.5, ఆదిలాబాద్ అర్బన్, చాప్రాలో 8.8 డిగ్రీలు, తలమడుగు 9 డిగ్రీలు, రామ్నగర్లో 9.3, తాంసి, గిన్నెదరిలో 9.5 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అదేవిధంగా 23 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. శనివారం చలితీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని, అనేక జిల్లాల్లో పది డిగ్రీలకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొన్నది.