నిడమనూరు, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన దంపతులు యూరప్లోనే అత్యంత ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. చాపల వెంకట్రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కర్ర విజయలక్ష్మి దంపతులు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15న ఉదయం 5:55 గంటలకు 5,642 మీటర్ల ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ మంచు పర్వత శిఖరాగ్రానికి చేరుకొని జాతీయ జెండాను ప్రదర్శించారు. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో గంటకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల మధ్య అతి క్లిష్టమైన వాతావరణంలో పర్వతారోహణ చేశారు.