NIA | మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. ఈ మేరకు శిరీష అరెస్ట్పై ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే దుడ్డు ప్రభాకర్ను సైతం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శిరీష, దుడ్డు ప్రభాకర్ ఇద్దరూ మావోయిస్టుల కోసం పని చేస్తున్నారని చెప్పారు. మావోయిస్టుల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు గుర్తించామని, 2019 తిరియా ఎన్కౌంటర్లో ప్రభాకర్, శిరీష ఇద్దరు పాల్గొన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్టుల కోసం కొత్త రిక్రూట్మెంట్లు కూడా ఇద్దరు చేస్తున్నారని, వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని వివరించింది.