న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఉక్కుపాదం మోపుతున్నది. సంస్థతో సంబంధాలున్నవారికోసం ముమ్మరంగా గాలిస్తున్నది. తాజాగా మోస్ట్ వాంటెడ్ జాబితాను ఎన్ఐఏ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్కు చెందిన అబ్దుల్ సలీ, నిజామాబాద్లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్ ఉన్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ అహ్మద్ కూడా ఉన్నాడు. వీరికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. 9497715294 అనే వాట్సాప్ నంబర్కు కాల్ చేయవచ్చని కోరింది. సమాచారం అందించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. ఈ ముగ్గురితోపాటు కేరళలో 11 మంది, కర్ణాటకలో ఐదుగురు, తమిళనాడులో ఐదుగురిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తుండటంతో గతేడాది సెప్టెంబర్లో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 100కుపైగా ప్రదేశాల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్లో అనుమానితుల ఇండ్లలో సోదాలు చేశారు.