కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) చెందిన ఓ కీలక నేత ఇంట్లో గురువారం ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో ఎన్ఐఏతోపాటు, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు.
ఉదయం నుంచి సుమారు ఐదు గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఆ ఇంట్లో లేరని తెలుస్తున్నది. విదేశాల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. హుస్సేనీపురతోపాటు కార్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలోని పలు ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు.