కొండపాక, మే,10 : ప్రేమ పెళ్లి చేసుకున్న నెలలోపే మనస్పర్థలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాకలో ఆదివారం జరిగింది. కొండపాక ఎస్సై శ్రీనివాస్ వి వరాల ప్రకారం.. కొండపాకకు చెందిన దండ్ల అంజలి (21), కొ మురవెల్లికి చెందిన దేశెట్టి వినయ్ (23) ప్రేమించుకుని ఏప్రిల్ 9న పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకుని కొమురవెల్లిలో నివాసం ఉంటున్నారు.
మూడు రోజుల క్రితం కడుపునొప్పి వస్తున్నదని అంజలి భర్తకు తెలుపగా, ఆమెను కొండపాకలో దింపిన వినయ్ హైదరాబాద్కు బయలుదేరాడు. మధ్యలో అంజలికి వినయ్ ఫోన్ చేయగా కాల్ బిజీగా వచ్చింది. దీంతో ఎవరితో మాట్లాడుతున్నావంటూ అంజలిని తిట్టాడు. తీవ్ర మనస్తాపానికిగురై, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న వినయ్ హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ మార్గమధ్యలో కొడకండ్ల వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.