హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఇటీవల నూతనంగా నియమితులైన లోకాయుక్త, ఉప లోకాయుక్తలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్టిస్ బీఎస్ జగ్జీవన్కుమార్తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్రెడ్డి, సీఎస్, డీజీపీ, ఇతరశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరి పదవీకాలం 5 ఏండ్లు లేదా వారి వయసు 70 ఏండ్ల వరకు పదవిలో కొనసాగనున్నారు.