హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 772 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 6,36,049కి పెరిగాయి. ఇవాళ్టి వరకు 6,22,313 మంది కోలుకున్నారు. మరో 9980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3756కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,15,515 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.