హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 704 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసులు 6,38,030కి పెరిగాయి. ఇప్పటివరకు 6,24,477 మంది కోలుకున్నారు. ఇంకా 9,787 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,766కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,04,478 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.