హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,330కి పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,31,389 మంది కోలుకున్నారు. ఇంకా 9,141 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3800కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,11,251 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ తెలిపింది.