హైదరాబాద్ : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 88,347 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 389 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారినపడిన వారిలో 420 మంది కోలుకున్నారు. ఇవాళ ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,55,732కు పెరిగింది. ఇవాళ్టివరకు మొత్తం 6,45,594 మంది కోలుకున్నారు. మొత్తం మరణాలు 3,862కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.