హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల నైపుణ్యాభివృద్ధే ధ్యేయంగా విశ్వవిద్యాలయాలకు నూతన సిలబన్ను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగ్రవాల్ చెప్పా రు. వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల విశ్వవిద్యాలయాలు ప్రతిభ కలిగిన విద్యార్థులను ఆకర్షించే ప్రత్యేక కేంద్రాలుగా ఎదగాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కన్హశాంతి వనంలో మూడురోజులుగా నిర్వహిస్తున్న అఖిల భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల వీసీల సమావేశం ఆదివారం ముగిసింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరం నుంచి యోగ, ధ్యానంలో మూడు వారాల ఫౌండేషన్ కోర్సును ప్రతిపాదించినట్టు తెలిపారు. సహజ వ్యవసాయంపై బీఎస్సీ హానర్స్ డిగ్రీ ప్రోగ్రాం ఏర్పాటుకు ప్ర తిపాదనలను సిద్ధం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక హార్ట్ ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, న్యూఢిల్లీలోని అఖిల భారత వ్యవసా య పరిశోధన మండలి మధ్య అవగాహన ఒ ప్పందం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఉ ద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ బీ నీరజ ప్రభాకర్, డాక్టర్ పీఎస్ పాండే, డాక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బీ నీరజ ప్రభాకర్ నేతృత్వంలో వివిధ రాష్ర్టాల నుంచి హాజరైన మహిళా వీసీలు, వీసీల సతీమణులు బతుకమ్మ ఆడారు.