హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఐఏఎస్లుగా ప్రమోషన్ పొందిన 10 మంది అధికారులు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నెల 16న వారి నియామక తేదీగా నిర్ణయించింది. రాష్ట్ర అధికారులైన కే అశోక్రెడ్డి, కే హరిత, పీ కాత్యాయనీదేవి, ఈవీ నర్సింహారెడ్డి, ఈ నవీన్ నికోలస్, ఏ నిర్మలాకాంతి వెస్లీ, కోట శ్రీవాత్సవ, చంద్రశేఖర్ బడుగు, సీహెచ్ ప్రియాంక, జే అరుణశ్రీకి ఐఏఎఎస్ హోదా ఇస్తూ ఇటీవలే కేంద్రం గెజిట్ జారీ చేసింది.