హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు లబ్ధి చేకూర్చేందుకు నూతన హెల్త్స్కీంను ప్రవేశపెడతామని మంత్రి హరీశ్రావు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ నేతలు తెలిపారు. త్వరలోనే ఈ స్కీం మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. బుధవారం పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే పెండింగ్ బిల్లులను ఖాతాల్లో జమచేస్తామని హామీనిచ్చినట్టు తెలిపారు.
మంత్రికి టీటీజీడీఏ వినతి వివిధ అంశాలపై తెలంగాణ టీచింగ్
గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీ డీఏ) బుధవారం హైదరాబాద్లో వైద్యా రోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును కలిసి వినతి పత్రం అందజేసింది. బోధన డాక్టర్ల సమస్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లి, పరిష్క రించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్, ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు కిరణ్ మాదాల, కోశాధికారి కిరణ్ప్రకాశ్ తదిత రులు పాల్గొన్నారు.