హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటామని న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ పాండియన్(Pandian) అన్నారు. గురువారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో మూసీ(Moosey River) పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు పేర్కొన్నారు.
నదిని సంరక్షిస్తూ స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాతమని సీఎం చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హైదరాబాద్లోని రెండవ దశలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు, రాష్ట్రములో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థలు ఏర్పాటు కు సహకరించాలన్నారు.
హాస్పిటల్స్ నిర్మాణం, విద్యాసంస్థల హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణానికి, రాష్ట్రప్రభుత్వం చేపట్టే గృహ నిర్మా ణాలకు అలాగే వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి వీక్క్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.