హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 2387 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా మరో 4559 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30931 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 79561 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 688 కరోనా కేసులు నమోదయ్యాయి.