హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సం ఘం (టీజీవో)కు అనుబంధంగా పెన్షన్ పేమెం ట్ ఆఫీసర్స్ నూతన కమిటీ ఎన్నికైంది. గురువారం హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ సమక్షంలో ఎన్నిక నిర్వహించారు.
పెన్షన్ పేమెంట్ ఆఫీసర్స్ అధ్యక్షురాలిగా అంజుమ్ ఆర, ప్రధానకార్యదర్శిగా ప్రభాకర శ్రీవాస్తవ, కోశాధికారి గా ఖలీల్, అసోసియేట్ అధ్యక్షుడిగా తాజుద్దీన్, ఉపాధ్యక్షులుగా సీహెచ్ పార్వతీదేవి, జీ కిషన్, సయ్యద్ ముజమ్మిల్ అఫ్రోజ్, సహాయ కార్యదర్శులుగా ఏ శ్రీనివాసరావు, ఎస్ రవీందర్, మహమ్మద్ మూకీమ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా అబీద్ అలీ ఎన్నికయ్యారు.