హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు చికిత్స చేసేందుకు నూతన వైద్య విధానాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని పరిశోధకులు ఉద్ఘాటించారు. ఐఐసీటీలో జరిగిన జాతీయ సదస్సులో వారు క్యాన్సర్కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
క్యాన్సర్ ఇమ్యూనో థెరపీలో మరింత పురోగతి కోసం కాంబినేషన్ థెరపీలు, ప్రత్యామ్నాయ చికిత్స విధానాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని బెంగుళూరుకు చెందిన ఆరీజెన్ సంస్థ సీఈవో డాక్టర్ మురళి రామచంద్ర వివరించారు.