హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీ బస్స్టేషన్కు, ఎంజీబీఎస్ బస్స్టేషన్కు తేడా తెలియకుండా మాట్లాడటంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల్లో మూసీ సుందరీకరణపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.
దానం నాగేందర్ సైతం జోక్యం చేసుకుని మాట్లాడారు. మూసీ వరదల వల్ల జూబ్లీబస్టాండ్ ప్రాంతం మునిగిపోతున్నదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి మూసీ పక్క న ఉన్నది జూబ్లీ బస్స్టేషన్ కాదు.. ఎంజీబీఎస్ బస్స్టేషన్. దీంతో సోషల్మీడియాలో నెటిజన్లు దానంను ఆటాడుకున్నారు. నగరంపై అవగాహన ఇదేనా? అంటూ చురకలంటిస్తున్నారు.