న్యూఢిల్లీ, జూలై 10: ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటిదాకా జరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.75 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే వ్యవధితో పోల్చితే 15.87 శాతం పెరిగాయి. కాగా, 2023-24లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.18.23 లక్షల కోట్లు గా నిర్ణయించింది. ఈ క్రమంలో ఇందులో 26.05 శాతాన్ని అందుకున్నామని ఐటీ శాఖ తెలియజేసింది.