Nelore Cow Breed | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): మన దేశానికి చెందిన నెల్లూరు జాతి రకం ఆవుకు ప్రపంచంలోనే అత్యధిక ధర పలికింది. ఏకంగా ఒక్క ఆవును రూ.4.8 మిలియన్ డాలర్ల (రూ.40 కోట్లు)కు విక్రయించారు. బ్రెజిల్ దేశంలో ఇటీవల నిర్వహించిన ఓ వేలంలో రికార్డు ధరకు విక్రయంతో ఇది వార్తల్లో నిలిచింది.
బోస్ ఇండికస్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ నెల్లూరు మేలురకానికి చెందిన ఆవును 1868లోనే బ్రెజిల్కు తరలించారు. ఆ తర్వాత బ్రెజిల్లో ఈ జాతి పశుసంతతి బాగా పెరిగింది. ప్రస్తుతం ఒక్క బ్రెజిల్లోనే ఈ నెల్లూరు జాతికి చెందిన పశువులే 1.6 కోట్ల వరకు ఉండటం విశేషం.