హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): పోస్టల్ బ్యాంకులు ఏర్పాటుచేస్తున్నట్టు ఆర్భాటాలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అమలు చేయడంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. గురువారం కరీంనగర్, హుజూరాబాద్, వరంగల్ పోస్టల్శాఖ అధికారులు, ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాంకు వ్యవస్థను తక్షణమే అమలుచేసి లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. వీటిలో జాతీయ బ్యాంకులకు ఉన్న వసతులు కల్పించాలని కోరారు. పోస్టల్శాఖ ఉద్యోగుల సమస్యలను పరిషరించేందుకు, వారికి సంఘం కార్యాలయాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.