హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ ఫలితాల్లో ఎస్టీ క్యాటగిరీలో ఆలిండియా ఫస్ట్, సెకండ్ ర్యాంక్లను తెలంగాణ విద్యార్థులు సాధించడం రాష్ట్రానికి గ ర్వకారణమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గిరిజన గురుకుల విద్యాలయాల్లో 80 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటే 48 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. తన స్వ గ్రామం పెద్దతండాకు చెందిన మంజుల మంగీలాల్ కు మార్తె గుగులోత్ శివాణి (ఎస్టీ క్యాటగిరిలో) 2వ ర్యాంకు సాధించిం ది.
ఎస్టీ క్యాటగిరీలో 6వ ర్యాంకు సాధించిన అనుమేహ భూక్య (వరుసకు మనవరాలు)ను గురువారం మా సబ్ట్యాంక్లోని సంక్షేమభవన్లో మంత్రి సత్యవతి అభినందించారు. తన తల్లిదండ్రు లు మోతీలాల్ -కృష్ణవేణితో అనుమేహ మం త్రిని కలిశారు. గిరిజన గురుకులాల్లో చదివి నీట్లో (ఎస్టీ క్యాటగిరీలో) ఆలిండియా ర్యాంకులు సాధించిన ఎం రామదాసు (346 ర్యాంక్), ఎన్ సురేశ్ (380 ర్యాంకు), నరేందర్నాయక్ (439 ర్యాంకు)తోపాటు పలువురిని మంత్రి అభినందించారు.