హైదరాబాద్ : నీరా, దాని అనుబంధ ఉత్పత్తులైన బెల్లం, చక్కెర, నీరా సిరప్ల తయారీతోపాటు ఇతర బై ప్రొడక్ట్ల తయారీ, ప్యాకింగ్, విక్రయానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ధ్రువీకరణ లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లభించడంపై ఆబ్కారీశాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.
సోమవారం తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అద్భుత ఔషధ గుణాలున్న నీరా క్యాన్సర్, కిడ్నీలు, నరాల బలహీనత లాంటి రోగాలను నయం చేస్తుందన్నారు. ఇంతటి ఔషధ గుణాలున్న నీరాను గత ప్రభుత్వాలు విస్మరించి.. వృత్తిని అవమానపరిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రకృతి సిద్ధమైన నీరా, కల్లును ద్రవ పదార్థముగా గుర్తించి నీరా పాలసీని ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. నెక్లెస్ రోడ్డులో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న నీరా కేఫ్ను ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నీరా కలెక్షన్స్ సెంటర్లలో ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టూరిజంశాఖ ఎండీ మనోహర్, అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు దత్తరాజ్గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.