హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే రైతులు, దళిత, బహుజన, ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సంప్రదాయ పార్టీలు చిత్తశుద్ధిలేని కార్యాచరణతో మూసపద్ధతితో కూడిన పాలనారీతులు కొనసాగించినన్నాళ్లూ భారత్ అభివృద్ధి చెందదని చెప్పారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి బుధవారం చేరికలు కొనసాగాయి. అహ్మద్నగర్ నుంచి పలువురు ప్రముఖులు అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎన్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్ షెలార్ చేరిక ప్రాధాన్యతను సంతరించుకున్నది.
అహ్మద్నగర్ జిల్లా శ్రీగోంధా నియోజకవర్గంలో రాజకీయంగా ప్రజల్లో పట్టు వున్న నేత ఘనశ్యామ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్లను సాధించి గెలిచారు. అయితే ఆ తర్వాత సాంకేతిక కారణాలతో ఓ టమిని ప్రకటించారు. మహారాష్ట్ర నేతల చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దే శాన్ని అభివృద్ధి పథంలో నడిపించటానికి రా కెట్ సైన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని, పాలకులకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకునే తపన ఉండాలని చెప్పారు. ప్రజల కోసం సృజనాత్మకంగా పనిచేసే ఆలోచనావిధానాలు ఏడు దశాబ్దాల పాలకులకు లే కపోవటం ఈ దేశ ప్రజల దురదృష్టమని తెలిపారు.
భూగోళం మీద ఏ దేశానికీ లేనన్ని సహజవనరులు మనదేశంలో ఉన్నా కనీస అవసరాలైన నీరు, విద్యుత్తు కోసం తపించటం శోచనీయమని అన్నారు. ప్రభుత్వాలు రైతుకేంద్రం గా, దళిత, ఆదివాసీ, బలహీనవర్గాలు కేంద్రం గా పాలనా ప్రాధమ్యాలను ఖరారు చేసుకోవాలని తెలిపారు. అట్లా చేసుకోగలిగినం కాబట్టే నేడు తెలంగాణ దేశానికి రోల్మాడల్ అయ్యిందని చెప్పారు. ఈ దేశంలోని పెద్ద పెద్ద రాష్ర్టాలకంటే అతి పిన్నవయస్సున్న తెలంగాణ అ త్యంత తక్కువ కాలంలో ఎలా రోల్మాడల్ అయ్యిందో సీఎం కేసీఆర్ వారికి వివరించారు.
పరివర్తనతోనే దేశాభివృద్ధి
తెలంగాణను అభివృద్ధి చేసుకున్న పద్ధతి లో, ఈ దేశంలో పాలన సాగటం లేదని సీంఎ కేసీఆర్ స్పష్టం చేశారు. ‘ఈ దేశంలో పరివర్తన రానిదే అభివృద్ధి జరగదు. పరివర్తన తీసుకొచ్చే ఆలోచన కేంద్రంలోని పాలకులకు లేదు. మూ స ధోరణులు,అధికారుల మీద ఆధారపడటం, కాలం వెళ్లదీయటమే తప్ప.. ప్రజాసమస్యల ను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చేయాలనే మనసు లేనే లేదు. మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుంది. అనే విషయాన్ని తొమ్మిదేండ్ల తెలంగాణ నిరూపించింది.’ అని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్తు వ్యవస్థను, సాగునీటి వ్యవస్థను చక్కదిద్దటానికి తాను ఎట్లాంటి ఆ లోచనలు చేశానో మహారాష్ట్ర నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు. పరిపాలనలో తలెత్తే స మస్యలను అధిగమిస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకుపోవటం కోసం తాను ఎంచుకున్న మా ర్గాలు, విశ్లేషించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నేతలు.. తామొక నూతన పాలనా వరవడి విధానం గు రించి వింటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. హర్షాతిరేకంతో జై కేసీఆర్ అంటూ నినదించా రు. భారతదేశంలో సమూల మార్పును తీసుకొచ్చేందుకు పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని.. అందు కు ముందడుగు మహారాష్ట్ర నుంచే పడుతున్నందుకు సంతోషంగా ఉన్నదని సీఎం అన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో…
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కార్యాచరణ దేశమంతా విస్తరించాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీలో చేరే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. బుధవారం పార్టీలో చేరిన వారిలో ఎన్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్ షెలార్తోపాటు ఓబీసీ సెల్ అహ్మద్నగర్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ ఆనంద్కర్, సర్పంచ్ శరద్పవార్, దర్శకుడు ప్రకాష్ నింభోర్, కుక్డి చక్కెర కర్మాగారం సభ్యుడు అబాసాహెబ్ షిండే, మాజీ చైర్మన్ విలాస్ భైలుమే, సర్పంచ్ కేశవ్జెండే, షాహాజీ ఇతాపే, చైర్మన్ సొసైటీకి చెందిన చంద్రకాంత్ పవార్, ప్రకాశ్ పోతే, ప్రశాంత్ షెలార్, సిద్ధేశ్ ఆనంద్కర్, ప్రవీణ్ షెలార్, సంజయ్ వాగాస్కర్, వహతుక్ సేన అధ్యక్షుడు సందీప్ దహతోండే, సేవాదళ్కు చెందిన షామ్జారే తదితరులున్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అభివృద్ధి చెందిన భారతదేశం ఆవిష్కరణ దిశగా తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారంతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలు ఖదీర్ మౌలానా, హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు.