హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో కేశఖండన టికెట్ల ధరను రూ.20 నుంచి రూ.50 పెంచడం, ఆ ధరలో 60 శాతం సొమ్మును నాయీ బ్రాహ్మణులకు చెల్లించాలని నిర్ణయించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కల్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులకు లబ్ధి చేకూరనుందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాయీ బ్రాహ్మణులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.