Telangana
- Dec 27, 2020 , 01:33:14
లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు, న్యాయవాది ఎం లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ఆ వేదిక నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శనివారం విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు. అసెంబ్లీ, కౌన్సిల్లో అడుగుపెట్టని నాయీ బ్రాహ్మణులకు నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహేశ్చంద్ర, కార్యనిర్వాహక అధ్యక్షుడు పడుగు హరిప్రసాద్, నాయకులు అనంతయ్య, రమేశ్కుమార్, పద్మారావు, రమేశ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- షాక్ ఇచ్చిన రోగి..ప్రాణం పోసిన డాక్టర్లు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- ఆ షాట్ ఏంటి?.. రోహిత్పై గావస్కర్ ఫైర్
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- నిర్మలమ్మకు విషమపరీక్ష: ఐటీ మినహాయింపులు పెరిగేనా?!
- రన్వేపైకి దూసుకెళ్లిన కారు.. ఒక వ్యక్తి అరెస్ట్
MOST READ
TRENDING