BRS | హైదరాబాద్/రంగారెడ్డి, మార్చి 7(నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ స్థా నిక సంస్థల బీఆర్ఎస్ ఎ మ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్కుమార్ బరిలోకి దిగుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో పలుమార్లు చర్చించి, క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ అనంతరం అధినేత కేసీఆర్ గురువారం ఆయన పేరును ప్రకటించారు. నందిగామ మండలం మామిడిపల్లికి చెం దిన నవీన్కుమార్ 2006లో మామిడిపల్లి ఉపసర్పంచ్గా గెలిచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో కొత్తూరు జడ్పీడీసీగా, అదే ఏడాది ఉమ్మడి పాలమూరు జడ్పీ వైస్ చైర్మన్గా ఆయన పనిచేశారు.
గెలుపు నల్లేరు మీద నడకే
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ నుంచి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ఎంఎస్ఎన్ ఫార్మా డైరెక్టర్ మన్నె జీవన్రెడ్డి పోటీలో ఉన్నారు. ఏ రకంగా చూసినా బీఆర్ఎస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మ డి పాలమూరు పరిధిలో 1,445 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,006 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీల తర్వాత 850 మంది వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉండడం బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత సైతం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూలాంశంగా మారనుంది.