Karimnagar | ‘మీరొచ్చింది చాలు.. పరామర్శకు రమ్మని మేము ఎవరినీ పిలవలేదు.. కోరలేదు.. మీరు వచ్చి పరామర్శించారు.. ఇక చాలు.. మా కొడుకు ఏ గ్రూప్ పరీక్షలకూ ప్రిపేర్ కావడం లేదు.. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల చనిపోలేదు.. మాకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మాకు ఇంకేమి కావాలి’ ఇది.. పరామర్శ పేరిట తమ ఇంటికి వచ్చిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి నవీన్కుమార్ కుటుంబసభ్యులు చేతులు జోడించి చెప్పిన సమాధానం.
తన కొడుకు మరణాన్ని రాజకీయం చేయవద్దని ఆదివారం తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి దండంపెట్టి కోరుతున్న నవీన్కుమార్ తండ్రి నాగభూషణం
కరీంనగర్ మార్చి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిరిసిల్లలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నవీన్కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల, జీవన్రెడ్డి ఆదివారం విడివిడిగా ఆ ఇంటికి వెళ్లారు. నవీన్కుమార్ ఆత్మహత్యను తెలంగాణ ప్రభుత్వానికి ఆపాదించేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు నేతలతో నవీన్కుమార్ తండ్రి నాగభూషణం, బాబాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ బిడ్డ ఆత్మహత్యకూ టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్కు ఏ మాత్రం సంబంధం లేదని మరోమారు స్పష్టంచేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. తొలుత ఆదివారం ఉదయం జీవన్రెడ్డితోపాటు వచ్చిన కాంగ్రెస్ నేతలపై నవీన్ కుటుంబసభ్యులు ఒక దశలో సీరియస్ అయ్యారు.
‘మా కొడుకు మరణంతో మేము పుట్టెడు దుఃఖంలో ఉంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఏదేదో మాట్లాడి లేని పోని అనుమానాలు సృష్టిస్తున్రు. సోషల్మీడియాలో శవ రాజకీయాలు చేస్తున్రు. మాకు సంబంధం లేకుండా వస్తున్న వార్తలు, ఇతరు లు చెప్పే మాటలు చూస్తే బాధ వేస్తున్నది. మమ్మల్ని మరింత క్షోభ పెడుతున్నాయి. మా కొడుకు గ్రూప్ పరీక్షలకు దరఖాస్తు చేయలేదు. వాటికి ప్రిపేర్ అయ్యే ఆలోచనే లేదు. మా కొడుక్కు జాబ్ రాక చనిపోలేదు. రెండు ప్రైవేట్ జాబ్లకు రిజైన్ చేసిండు. జాబ్ రాకపోతే రెండింటికి ఎట్ల రిజైన్ చేస్తడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు వెళ్లాలని అనుకున్నడు. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటుండు. రెగ్యులర్ డిగ్రీ లేకపోవడంతో పెద్ద జాబ్లు వస్తాయో రావో అని మదనపడి ఇంట్లో ఎవరూలేని సమయం లో ఇలా చేసుకున్నాడే తప్ప పేపర్ లీక్తో సం బంధం లేదు. దయచేసి రాజకీయం చేయవద్దు. మా మంత్రి కేటీఆర్ మాకు ఫోన్చేసిం డు. అన్ని రకాలుగా ఆదుకుంటమన్నడు. అది చాలు మాకు. వాళ్ల మాటలు వీళ్ల మాటలు విని రాజకీయాలు చేసేటోళ్లం కాదు. బ్లాక్మెయిల్ చేసోటోళ్లం అసలే కాదు’ అని స్పష్టంచేశారు. కుటుంబసభ్యులు ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఆ తరువాత జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నవీన్కుమార్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆ తరువాత వచ్చిన వైఎస్ షర్మిలకూ ఇదే అనుభవం ఎదురైంది. ‘అమ్మా.. మీరు వచ్చా రు. పరామర్శించారు.. మీలాంటి వాళ్లు వస్తా రు.. పోతారు. కానీ, చావుతో ఎటువంటి సం బంధం లేకపోయినా మా మంత్రి కేటీఆర్ మాకు హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. మాకు ఇంకేమి కావా లి’ అంటూ నాగభూషణం నిర్మొహమాటంగా మాట్లాడారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న షర్మిల.. వెంటనే తెరుకొని ‘నేను రాజకీయం చేయడానికి రాలేదు. మానవత్వంతో పరామర్శకు వచ్చాను’ అని చెప్తూ బయటకు వెళ్లారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన షర్మిల.. వారు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడారు. ఉద్యోగం రాకపోవడం వల్ల నవీన్కుమార్ చనిపోయాడంటూ దుష్ప్రచారానికి దిగారు. ఈ ఘటనకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలంటూ విమర్శలకు దిగారు.
పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ అర్థంలేని ఆరోపణలు చేస్తూ ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. పేపర్ లీకేజీ విషయం దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. నిందితులను అరెస్టు చేయడంతోపాటు సిట్ను ఏర్పాటు చేసి విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నది. దీనిపై కేటీఆర్ పూర్తి వివరణ ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఘనత బీఆర్ఎస్ సరార్ దే. టీఎస్పీఎస్సీకి కేటీఆర్కు సంబంధమేంటో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి. ఉద్యోగార్థులు ఎవరూ కూడా అధైర్య పడాల్సిన పనిలేదు. ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుంది.
– మంత్రి కొప్పుల ఈశ్వర్