తుఫాన్లో నేలకూలిన భారీవృక్షం
ఓ వృక్ష ప్రేమికుడి కృషితో పునర్జీవం
బంజారాహిల్స్, ఫిబ్రవరి 26: ఒక ఆలోచన.. కాలగర్భంలో కలిసిపోవాల్సిన భారీ వృక్షానికి పునర్జన్మ ప్రసాదించింది. తమ కండ్లెదుటే కూలి పోయి, తమ కృషితో మళ్లీ పునర్జీవం పొందిన ఆ చెట్టుకు శనివారం బర్త్డే చేశారు. జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్కు వాక్వేలో ఉన్న పిల్లోఫారం జాతికి చెందిన 25 ఏండ్ల భారీ వృక్షం గతేడాది అక్టోబర్లో కురిసిన తుఫాన్ కారణంగా నేలకూలింది. చలించిపోయిన మేక విజయసాయి సొంత డబ్బుతో, జేసీబీ సాయంతో దానిని పూర్వ స్థానంలో నిలబెట్టాడు. ఆ చెట్టు ప్రాణం పోసుకొని, చిగురించింది. ఈ సంఘటన జరిగి ఏడాది కావడంతో బర్త్డే ఫంక్షన్ చేశారు. ఈ వేడుకలకు హాజరైన సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ వృక్ష ప్రేమికుడు విజయసాయిని అభినందించారు.