రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు చిన్నా పెద్ద సేదతీరేందుకు ఉపయోపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లోని ప్రకృతివనంలో ఓ ఇద్దరు వృద్ధులు ఇలా సరదాగా ఉయ్యాల ఊగుతూ ‘నమస్తే’ కెమెరాకు చిక్కారు. ఈ వృద్ధుల ఫొటోను ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్ చేశారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ముక్రా(కే) గ్రామానికి చెందిన ఈ సంతోషకరమైన దృశ్యాలను చూడండి అంటూ ఫొటోలను పోస్ట్ చేశారు. ‘పల్లె ప్రకృతివనంలో ఆనందాన్ని, ఊయలను ఆస్వాదిస్తున్నారని, సీఎం కేసీఆర్ చెప్పినట్టు మనం మొక్కలు నాటితే ప్రకృతి మనకు అంతగా తిరిగి ఇస్తుంది’ అని ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. – ఇచ్చోడ