హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగంలో భారీగా బదిలీలు చేపట్టారు. తాజా బదిలీల్లో హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి సంబంధించి కీలక మార్పులు జరిగాయి. వివిధ హోదాల్లో ఉన్న మొత్తం 56 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. రెగ్యులర్ విధులతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహించేలా మరో 14 మంది డిప్యూటీ డైరెక్టర్ (డీడీ), అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ జోనల్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్గా సేవలందిస్తున్న సుమీత్శర్మ బదిలీ అయ్యారు. ఈయనను షిమ్లా సబ్ జోనల్ ఆఫీస్కు బదిలీ చేశారు. అలాగే భోపాల్ జోనల్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్వాతి నోఖ్వాల్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. సోర్స్ హెడ్ క్వార్టర్స్లో ఏఈవోగా ఉన్న జైరామ్ లఖ్రాన్ను హైదరాబాద్ జోనల్ ఆఫీస్కు బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, లక్నో, గౌహతి, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లోని జోనల్ కార్యాలయాల్లోనూ పెద్దఎత్తున మార్పులు జరిగాయి.