కాచిగూడ, నవంబర్ 20: రైతు ఉద్యమాల స్ఫూర్తితో త్వర లో బీసీల వాటాకోసం దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శనివారం ఆ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో జనగణనలో కులగణన చేపట్టాలని వేలాది మందితో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న 56 శాతం బీసీల మనోభావాలను గ్రహించి వారి వాటా వారికే కేటాయించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని బీసీ అయిఉండి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నీల వెంకటేశ్, చంటి ముదిరాజ్, రఘవేందర్, జీ కృష్ణయాదవ్, కే శివ మ్మ, సత్యనారాయణ పాల్గొన్నారు.