సూర్యాపేట : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతుంది. వారి జాతీయ వాదంలో డొల్లతనం కనిపిస్తున్నదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. గణతంత్ర వేడుకల్లో కేంద్రం వివక్ష పై మంత్రి బీజేపీపై ఫైర్ అయ్యారు.
ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో విచిత్రమైన ప్రభుత్వం నడుస్తుందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా రాష్ట్రాలను గౌరవిస్తూ పాలన సాగేది. నేడు అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందేలా పాలన సాగడంలేదన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలని మంత్రి సూచించారు.
దేశ ఐక్యతను చాటే గణతంత్ర వేడుకలను కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తున్నది మండిపడ్డారు.
రాష్ట్రాల పై జరుగుతున్న వివక్షను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ చెప్పేది ఒకటి చేసేది ఇంకోటిలా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు దేశ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయన్నారు.
ఇది ప్రజల ప్రభుత్వం కాదు పెట్టుబడిదారుల ప్రభుత్వం అని ఘాటుగా విమర్శించారు. దేశభక్తులం అని చెప్పే బీజేపీ రాష్ట్రాల పై వివక్ష చూపి దేశద్రోహానికి పాల్పడుతుందని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.