హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేశారు. సిద్దిపేటలో కలెక్టరేట్లో జరిగిన జాతీయ సమైఖ్యతా దినోత్సం వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఎగురవేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి, వికారాబాద్లో మహేందర్ రెడ్డి, మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్, సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్లో మంత్రి గంగుల కమలాకర్, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నిజామాబాద్లో మంత్రి వేముల, జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల, గద్వాల కలెక్టరేట్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, వరంగల్లో మంత్రి ఎర్రబెల్లి, హనుమకొండలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
సెక్రటేరియట్లో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ కార్యాలయంలో ఏడీజీ శివధర్ రెడ్డి చే జాతీయ పతాకావిష్కరణ చేశారు. అలాగే అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి డీజీపీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమానికి ఐజీ తరుణ్ జోషి, ఏఐజీలు సంప్రీత్ సింగ్, నాగరాజు, ఎస్.పి వెంకటేశ్వర్లు, పలువురు సీనియర్ అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.