హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజాలో ఈ నెల 10 నుంచి 23 వరకు నిర్వహించనున్న జాతీయ చేనేత ప్రదర్శన-2024కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రదర్శనలో తెలంగాణతో పాటు తమిళనాడు, వెస్ట్బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, జమ్మూకశ్మీర్ తదితర రాష్ర్టాలకు చెందిన వస్ర్తాలు, ఇతర కళాఖండాలు ఉంటాయని తెలిపారు. వివిధ రాష్ర్టాల140 అపెక్స్ చేనేత సహకార సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని చెప్పారు.