పాలమూరు/మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 19 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇండోర్స్టేడియంలో త్వరలో జాతీయస్థాయి క్రీడలను నిర్వహిస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన ఇండోర్స్టేడియం పనులను పరిశీలించి మాట్లాడారు. ఇండోర్ స్టేడియాన్ని అంతర్జాతీయ వసతులతో నిర్మిస్తున్నామని, ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
400 మీటర్ల ఎనిమిది లైన్ల సింథటిక్ ట్రాక్ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన జిల్లా కేంద్రంలోని జంక్షన్లలో ఏర్పాటు చేస్తున్న విగ్రహాలను, బైపాస్పై ఏర్పాటు చేస్తున్న సెంట్రల్లైటింగ్ పనులను పరిశీలించారు. పట్టణంలో 18 జంక్షన్లను రూ.3 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కాగా సోమవారం పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా మారనున్నదని పేర్కొన్నారు.