Telangana | న్యూఢిల్లీ : నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం రాష్ట్రపతి భవన్లో గురువారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏఎన్ఎం తేజావత్ సుశీల అవార్డును అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుట్ట ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎంగా సుశీల విధులు నిర్వర్తిస్తున్నారు. 26 ఏండ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు తాను అందించిన వైద్య సేవలకు ఈ పురస్కారం లభించినట్లు సుశీల తెలిపారు.