హైదరాబాద్, అక్టోబర్ 2 (నమ స్తే తెలంగాణ): పీఎం విశ్వకర్మ యోజనపై పాలమూరు సభలో మోదీ గొప్పగా ప్రచారం చేయడం సిగ్గుచేటని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మండిపడ్డారు. ‘పీఎం విశ్వకర్మ యోజన’ పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా ఉందని విమర్శించారు.
5 శాతం వడ్డీతో కేవలం 18 నెలల్లో తిరి గి చెల్లించాలనే నిబంధనతో 3 లక్షల రుణంగా ఇస్తున్నారని తెలిపారు. వృత్తి నిర్వహణ పెట్టుబడి, ఆధునిక యంత్రాల కొనుగోలు కోసం తెలంగాణ ప్రభుత్వం చేతివృత్తిదారులకు 100 శాతం సబ్సిడీతో, బ్యాంకు లింకేజీలు లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయా న్ని అందిస్తున్నదని గుర్తుచేశారు.