భద్రాద్రి కొత్తగూడెం, మే 17(నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని జగన్నాథపురం పంచాయతీ అరుదైన ఘనతను సాధించింది. 2022లో నీటి నిర్వహణలో ఇతర పంచాయతీల కంటే మెరుగైన పద్ధతులు అవలంబించి జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైంది. జాతీయ స్థాయిలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది.
ఈ మేరకు బుధవారం రాత్రి కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి ప్రకటన వెలువడగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పంచాయతీ పాలకవర్గంతోపాటు నీటి సంరక్షణ చర్యల్లో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.