హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్స కోసం హైదరాబాద్ కేంద్రంగా మరో ఔషధం ఉత్పత్తి కానున్నది. అమెరికాకు చెందిన ఎలి లిల్లీ సంస్థ అభివృద్ధి చేసిన బారిసిటినిబ్ ట్యాబ్లెట్లను భారత్లో ఉత్పత్తిచేసేందుకు హైదరాబాద్కు చెందిన నాట్కో ఫార్మా ఒప్పందం చేసుకొన్నది. కొవిడ్ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగించేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గజైనేషన్ (సీడీఎస్సీవో) అత్యవసర అనుమతులు మంజూరుచేసింది. కరోనా వేళ 1 ఎంజీ, 2 ఎంజీ, 4 ఎంజీ డోసుల్లో బారిసిటినిబ్ను ఉత్పత్తిచేసేందుకు అనుమతులు పొందటంపట్ల నాట్కోఫార్మా హర్షం వ్యక్తంచేసింది. రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్ వంటి ఔషధాలు కొరతగా ఉన్నవేళ తమ ట్యాబ్లెట్లు ఊరట కలిగిస్తాయని అభిప్రాయపడింది. తమ ఔషధం బాధితుల రోగ నిరోధక వ్యవస్థ గాడి తప్పకుండా, సైటోకైన్ తుఫాను ఏర్పడకుండా అడ్డుకొంటుందని వెల్లడించింది. బారిసిటినిబ్ను సాధారణంగా ఆర్థరైటిస్ చికిత్సలో వినియోగిస్తున్నారు.