Gummadidala | నర్సాపూర్, మార్చి8 : డంపింగ్యార్డు నిర్మాణంతో నర్సాపూర్ పట్టణానికి ప్రమాదం పొంచి ఉందని మాజీ కౌన్సిలర్ రాంచందర్ పేర్కొన్నారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహారదీక్ష శనివారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. దీక్షలో భాగంగా 8వ వార్డుకు చెందిన అఖిలపక్ష నాయకులు, ముదిరాజ్ సంఘ నాయకులు, యూత్ సభ్యులు వంటావార్పు చేపట్టి నిరాహారదీక్షలో కూర్చున్నారు. రోడ్డుపైను వంటావార్పు నిర్వహించి బాటసారులకు బోజన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్బంగా మాజీ కౌన్సిలర్ రాంచందర్ మాట్లాడుతూ.. డంపింగ్యార్డుకు నర్సాపూర్ పట్టణం సమీపంలో ఉండడంతో గాలి, నీరు కలుషితమై నర్సాపూర్కు ఎక్కువగా ప్రమాదం జరుగుతుందన్నారు. కావున ప్రజలందరు ఏకతాటిపై నిలబడి డంపింగ్యార్డును రద్దు చేసే వరకు ఉధ్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రమణారావు, చౌటి జగదీశ్, విష్ణువర్ధన్రెడ్డి, ముదిరాజ్ సంఘ సభ్యులు, ముత్యాలమ్మ యూత్ సభ్యులు, డ్రాగన్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, టిటిడీ బాయ్స్ యూత్ సభ్యులు, రెబల్ బాయ్స్ యూత్ సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు, జగ్జీవన్ రావు సంఘ సభ్యులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.